Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:12 PM

ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. అదనపు కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. అదనపు కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. అదనపు కలెక్టర్
April 02, 2026 05:18 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తుర్కపల్లి, పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.

గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణ ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

పరీక్షల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.

కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పూర్తైన అనంతరం ప్రశ్నాపత్రాలను పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా తరలించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News