ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. అదనపు కలెక్టర్
ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. అదనపు కలెక్టర్
Editor Desk
తుర్కపల్లి, పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.
గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణ ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
పరీక్షల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.
కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పూర్తైన అనంతరం ప్రశ్నాపత్రాలను పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా తరలించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి