Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:59 PM

ప్రాణాలను నిలబెట్టే 'గోల్డెన్ అవర్'పై అవగాహన

ప్రాణాలను నిలబెట్టే 'గోల్డెన్ అవర్'పై అవగాహన

ప్రాణాలను నిలబెట్టే 'గోల్డెన్ అవర్'పై అవగాహన
April 17, 2026 04:28 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

- రోడ్డు ప్రమాద సమయాల్లో తక్షణ స్పందన అవసరం

​- 'అరైవ్ అలైవ్'లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి జిల్లా రోడ్డు భద్రత వారోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ‘గోల్డెన్ అవర్ ట్రైనింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లు, వాలంటీర్లకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.

మొదటి గంట అత్యంత కీలకం:

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ గా పరిగణిస్తారని, ఈ సమయంలో బాధితులకు సరైన ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో ప్రజలు భయపడకుండా తక్షణమే స్పందించాలని కోరారు.

​ప్రథమ చికిత్స: ప్రమాద స్థలంలో బాధితులను సురక్షితంగా వాహనాల నుంచి బయటకు తీయడం, రక్తస్రావం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే 100 లేదా 112 ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

​బాధితులను అంబులెన్స్‌లోకి తరలించేటప్పుడు వెన్నెముక, మెడ భాగాలకు గాయాలు కాకుండా పాటించాల్సిన మెళకువలను వివరించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్ఐ ఉపేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది,ఆసుపత్రి వైద్యులు, అంబులెన్స్ డ్రైవర్లు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News