ప్రాణాలను హరిస్తున్న ద్రాక్ష పండ్లు.. సైంటిస్టుల హెచ్చరికలు!
ప్రాణాలను హరిస్తున్న ద్రాక్ష పండ్లు.. సైంటిస్టుల హెచ్చరికలు!
GADDAM JAGANMOHAN REDDY
వేసవి కాలం రాగానే మార్కెట్లో ఆకుపచ్చ, నల్ల ద్రాక్ష పండ్లు విరివిగా కనిపిస్తాయి. రుచికరమైన ఈ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే దిగుబడి పెంచడం, కీటకాల నివారణ కోసం విస్తృతంగా వాడే పురుగుమందుల అవశేషాలు వినియోగదారులకు ప్రమాదంగా మారుతున్నాయని పలు ఆహార భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీటితో కడిగితే సరిపోతుందా?
ద్రాక్ష పండ్లకు సన్నని తొక్క ఉండటంతో పాటు అవి గుత్తులుగా పెరుగుతాయి. దీంతో పిచికారీ చేసిన పురుగుమందులు గింజల మధ్య ఖాళీల్లో పేరుకుపోయే అవకాశం ఎక్కువ. కేవలం కుళాయి నీటితో కడగడం వల్ల పైపొరలోని ధూళి, మురికి కొంతవరకు తొలగినా, రసాయన అవశేషాలు పూర్తిగా పోవు.
పలు అధ్యయనాల ప్రకారం మార్కెట్లో విక్రయించే ద్రాక్షలో పురుగుమందుల ఆనవాళ్లు గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. అందుకే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే నేరుగా తినడం ఆరోగ్యపరంగా సరికాదు.
ఎలా శుభ్రం చేయాలి?ఆహార నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు ఇవీ:
- ఒక లీటర్ నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి ద్రాక్షను 15–20 నిమిషాలు నానబెట్టాలి.
- లేదా బేకింగ్ సోడా కలిపిన నీటిలో 10–15 నిమిషాలు నానబెట్టాలి. ఇది పురుగుమందుల పొరలను బలహీనపరుస్తుంది.
- ద్రాక్షను గుత్తి నుంచి వేరు చేసి 2–3 సార్లు శుభ్రమైన నీటితో కడగాలి.
- చివరగా శుభ్రమైన గుడ్డ లేదా టిష్యూ పేపర్తో తుడిచి అదనపు తేమ తొలగించాలి.
రిఫ్రిజిరేటర్లో పెట్టేముందు జాగ్రత్త
చాలామంది పండ్లను కడగకుండా నేరుగా ఫ్రిజ్లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల పండ్లపై ఉన్న రసాయన అవశేషాలు అలాగే నిల్వ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా శుభ్రం చేసి, పూర్తిగా ఆరిన తర్వాతనే రిఫ్రిజిరేటర్లో ఉంచడం మంచిది.
పిల్లలు, వృద్ధులకు అదనపు జాగ్రత్తలు
పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల వీరికి ద్రాక్ష వంటి పండ్లు ఇచ్చే ముందు తప్పనిసరిగా శుభ్రపరిచినవే అందించాలి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి