Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:42 AM

పార్లమెంట్ అనుబంధ కమిటీలపై టీడీపీ కీలక చర్చలు

పార్లమెంట్ అనుబంధ కమిటీలపై టీడీపీ కీలక చర్చలు

పార్లమెంట్ అనుబంధ కమిటీలపై టీడీపీ కీలక చర్చలు
March 06, 2026 05:37 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంగళగిరి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ అనుబంధ కమిటీల ఏర్పాటు పై ముఖ్యమైన చర్చలు నిర్వహించారు. జోనల్–5 కోఆర్డినేటర్ బీద రవిచంద్ర, ప్రోగ్రామ్ కమిటీ ఇన్‌చార్జి రాంబాబు, కర్నూలు పార్లమెంట్ కోఆర్డినేటర్ వీరయ్య చౌదరి సూచనల మేరకు కర్నూలు జిల్లా నాయకులతో విస్తృతంగా సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేందర్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, ఎమ్మెల్సీ బీటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్ స్థాయి కమిటీలను బలోపేతం చేసి పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత శక్తివంతం చేయాలనే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు నిర్ణయించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News