పార్లమెంట్ అనుబంధ కమిటీలపై టీడీపీ కీలక చర్చలు
పార్లమెంట్ అనుబంధ కమిటీలపై టీడీపీ కీలక చర్చలు
స్థానికం బృందం
మంగళగిరి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ అనుబంధ కమిటీల ఏర్పాటు పై ముఖ్యమైన చర్చలు నిర్వహించారు. జోనల్–5 కోఆర్డినేటర్ బీద రవిచంద్ర, ప్రోగ్రామ్ కమిటీ ఇన్చార్జి రాంబాబు, కర్నూలు పార్లమెంట్ కోఆర్డినేటర్ వీరయ్య చౌదరి సూచనల మేరకు కర్నూలు జిల్లా నాయకులతో విస్తృతంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఆదోని నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేందర్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, ఎమ్మెల్సీ బీటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ స్థాయి కమిటీలను బలోపేతం చేసి పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత శక్తివంతం చేయాలనే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు నిర్ణయించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి