Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్‌కు ఘన నివాళి కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 12:40 PM

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట
March 05, 2026 06:06 PM 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ రైతు వేదికలో రైతులకు ప్రకృతి వ్యవసాయం (నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్)పై అవగాహన సదస్సు మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్, కౌన్సిలర్లు ఉదరి యాదయ్య, ఆలె శ్రీలత చిరంజీవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు దేశీయ విత్తనాలను సేకరించి వాటిని ఉపయోగించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో రైతు కనీసం 10 గుంటల భూమిలో తన కుటుంబానికి సరిపడా వరి ధాన్యాన్ని పండించుకోవచ్చని తెలిపారు. పెట్టుబడుల కోసం రసాయనాలపై ఆధారపడకుండా రైతులే జీవామృతం, ఘన జీవామృతం తయారు చేసుకుని వాడాలని సూచించారు.రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి దాని బదులుగా వేపపిండి వాడితే వరి పంటలో కంకులు ఒకేసారి రావడంతో పాటు చీడపీడల ఉధృతి తగ్గుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ రైతులందరూ పూర్వ పద్ధతులను అనుసరించి సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. వైస్ చైర్మన్ గోశిక వినయ్ మాట్లాడుతూ తంగడపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకుని రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించాలని సూచించారు. పెద్ద కొండూరు గ్రామానికి చెందిన రైతు వాకిటి రజిత గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తన అనుభవాలను రైతులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష పత్రాలను మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తంగడపల్లి గ్రామ రైతులు, కృషి సఖీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News