Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:08 AM

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట
05-03-2026 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ రైతు వేదికలో రైతులకు ప్రకృతి వ్యవసాయం (నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్)పై అవగాహన సదస్సు మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్, కౌన్సిలర్లు ఉదరి యాదయ్య, ఆలె శ్రీలత చిరంజీవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు దేశీయ విత్తనాలను సేకరించి వాటిని ఉపయోగించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో రైతు కనీసం 10 గుంటల భూమిలో తన కుటుంబానికి సరిపడా వరి ధాన్యాన్ని పండించుకోవచ్చని తెలిపారు. పెట్టుబడుల కోసం రసాయనాలపై ఆధారపడకుండా రైతులే జీవామృతం, ఘన జీవామృతం తయారు చేసుకుని వాడాలని సూచించారు.రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి దాని బదులుగా వేపపిండి వాడితే వరి పంటలో కంకులు ఒకేసారి రావడంతో పాటు చీడపీడల ఉధృతి తగ్గుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ రైతులందరూ పూర్వ పద్ధతులను అనుసరించి సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. వైస్ చైర్మన్ గోశిక వినయ్ మాట్లాడుతూ తంగడపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకుని రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించాలని సూచించారు. పెద్ద కొండూరు గ్రామానికి చెందిన రైతు వాకిటి రజిత గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తన అనుభవాలను రైతులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష పత్రాలను మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తంగడపల్లి గ్రామ రైతులు, కృషి సఖీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రకృతి వ్యవసాయంతో రైతుకు లాభాల బాట

Article Image

చౌటుప్పల్ రైతు వేదికలో రైతులకు ప్రకృతి వ్యవసాయం (నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్)పై అవగాహన సదస్సు మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్, కౌన్సిలర్లు ఉదరి యాదయ్య, ఆలె శ్రీలత చిరంజీవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు దేశీయ విత్తనాలను సేకరించి వాటిని ఉపయోగించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో రైతు కనీసం 10 గుంటల భూమిలో తన కుటుంబానికి సరిపడా వరి ధాన్యాన్ని పండించుకోవచ్చని తెలిపారు. పెట్టుబడుల కోసం రసాయనాలపై ఆధారపడకుండా రైతులే జీవామృతం, ఘన జీవామృతం తయారు చేసుకుని వాడాలని సూచించారు.రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి దాని బదులుగా వేపపిండి వాడితే వరి పంటలో కంకులు ఒకేసారి రావడంతో పాటు చీడపీడల ఉధృతి తగ్గుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ రైతులందరూ పూర్వ పద్ధతులను అనుసరించి సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. వైస్ చైర్మన్ గోశిక వినయ్ మాట్లాడుతూ తంగడపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకుని రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించాలని సూచించారు. పెద్ద కొండూరు గ్రామానికి చెందిన రైతు వాకిటి రజిత గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తన అనుభవాలను రైతులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష పత్రాలను మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తంగడపల్లి గ్రామ రైతులు, కృషి సఖీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News