ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. అర్జీలపై ఆలస్యం వద్దు: కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. అర్జీలపై ఆలస్యం వద్దు: కలెక్టర్ అనురాగ్ జయంతి
Editor Desk
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి తో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 30 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ అర్జీలలో రెవెన్యూ శాఖకు చెందినవి 25, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు 2, హౌసింగ్ శాఖకు 2, మున్సిపాలిటీకి 1 చొప్పున వచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి