Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాలకూ చేరిన “స్థానికం” – ఆసక్తిగా చదువుతున్న ప్రజలు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 10:43 PM

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
April 20, 2026 08:21 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, :

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 55 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అందిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు 40, మున్సిపాలిటీకి 5, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు 2, జిల్లా పంచాయతీకి 2, జిల్లా విద్యాశాఖకు 2 దరఖాస్తులు వచ్చాయి. కోఆపరేటివ్, ఎస్సీ కార్పొరేషన్, చేనేత, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖలకు ఒక్కటి చొప్పున అందినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News