ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్రావు
ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్రావు
Editor Desk
భువనగిరి, :
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 55 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అందిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు 40, మున్సిపాలిటీకి 5, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు 2, జిల్లా పంచాయతీకి 2, జిల్లా విద్యాశాఖకు 2 దరఖాస్తులు వచ్చాయి. కోఆపరేటివ్, ఎస్సీ కార్పొరేషన్, చేనేత, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖలకు ఒక్కటి చొప్పున అందినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి