Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:11 PM

ప్రజాప్రతినిధులకు 12న శిక్షణా కార్యక్రమం. రామకృష్ణారావు

ప్రజాప్రతినిధులకు 12న శిక్షణా కార్యక్రమం. రామకృష్ణారావు

ప్రజాప్రతినిధులకు 12న శిక్షణా కార్యక్రమం. రామకృష్ణారావు
10-03-2026 356 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఆదేశించారు.

జూన్ 12 వరకు చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పాలనపై పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు , రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12న నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే శిక్షణలో పది థీమ్‌లపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయా శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డీఎంహెచ్‌ఓ మనోహర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాప్రతినిధులకు 12న శిక్షణా కార్యక్రమం. రామకృష్ణారావు

Article Image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఆదేశించారు.

జూన్ 12 వరకు చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పాలనపై పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు , రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12న నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే శిక్షణలో పది థీమ్‌లపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయా శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డీఎంహెచ్‌ఓ మనోహర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News