Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:17 AM

ప్రజాప్రతినిధులకు 12న శిక్షణా కార్యక్రమం. రామకృష్ణారావు

ప్రజాప్రతినిధులకు 12న శిక్షణా కార్యక్రమం. రామకృష్ణారావు

ప్రజాప్రతినిధులకు 12న శిక్షణా కార్యక్రమం. రామకృష్ణారావు
March 10, 2026 06:42 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఆదేశించారు.

జూన్ 12 వరకు చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పాలనపై పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు , రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12న నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే శిక్షణలో పది థీమ్‌లపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయా శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డీఎంహెచ్‌ఓ మనోహర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News