ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిసరాల్లో చెత్త వేయకుండా చూడటం, ఇతరులను కూడా చెత్త వేయనీయకుండా చైతన్యం కల్పించడం వల్ల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటానికి దోహదపడుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పరిశుభ్రంగా ఉండటానికి కారణం ఇలాంటి కార్యాచరణలేనని పేర్కొన్నారు.
అందువల్ల విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఈ 99 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం కళాశాల ఆవరణను శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా చెత్త తొలగించడం, చెట్ల చుట్టూ గుంతలు తీయడం వంటి పనులను విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి