Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం
06-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిసరాల్లో చెత్త వేయకుండా చూడటం, ఇతరులను కూడా చెత్త వేయనీయకుండా చైతన్యం కల్పించడం వల్ల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటానికి దోహదపడుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పరిశుభ్రంగా ఉండటానికి కారణం ఇలాంటి కార్యాచరణలేనని పేర్కొన్నారు.

అందువల్ల విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఈ 99 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం కళాశాల ఆవరణను శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా చెత్త తొలగించడం, చెట్ల చుట్టూ గుంతలు తీయడం వంటి పనులను విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Sthanikam

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిసరాల్లో చెత్త వేయకుండా చూడటం, ఇతరులను కూడా చెత్త వేయనీయకుండా చైతన్యం కల్పించడం వల్ల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటానికి దోహదపడుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పరిశుభ్రంగా ఉండటానికి కారణం ఇలాంటి కార్యాచరణలేనని పేర్కొన్నారు.

అందువల్ల విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఈ 99 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం కళాశాల ఆవరణను శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా చెత్త తొలగించడం, చెట్ల చుట్టూ గుంతలు తీయడం వంటి పనులను విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News