Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:12 AM

ప్రజా ఉద్యమాలకు పాటే ప్రాణం: మాగి వెంకన్న

ప్రజా ఉద్యమాలకు పాటే ప్రాణం: మాగి వెంకన్న

ప్రజా ఉద్యమాలకు పాటే ప్రాణం: మాగి వెంకన్న
March 30, 2026 07:32 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం: ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపించడంలో పాటకు అపారమైన శక్తి ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ మాగి వెంకన్న అన్నారు. తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో నిర్వహించిన అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఖమ్మం జిల్లా 7వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు పాట ఉద్యమాలకు ప్రాణం పోసిందన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఒగ్గుకథలు, బుర్రకథలు, వీధి నాటకాలతో పాటు పాటలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. దొరల అహంకారాన్ని ఎదిరించడంలో, రైతాంగాన్ని మేల్కొల్పడంలో పాట ప్రధాన ఆయుధంగా నిలిచిందన్నారు.

1974లో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు నేతృత్వంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడి 54 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలకు సేవలందిస్తున్నదని గుర్తు చేశారు. ఈ ప్రయాణంలో పలువురు కళాకారులు తమ ప్రాణాలను సైతం అర్పించి ఉద్యమాలను నిలబెట్టారని అన్నారు.

నేటి సమాజంలో ప్రజా చైతన్యాన్ని పెంచే పాటలు తగ్గిపోతున్నాయని, పాలకులకు అనుకూలంగా మారుతున్న ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పాటలు ప్రజలను మేల్కొలిపి ఉద్యమాలను బలోపేతం చేశాయని, అలాంటి సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర, జిల్లా నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News