Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:12 PM

ప్రజా సేవే అసలైన సంపద: మంత్రి పొంగులేటి నిధుల వినియోగంలో ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి

ప్రజా సేవే అసలైన సంపద: మంత్రి పొంగులేటి నిధుల వినియోగంలో ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి

ప్రజా సేవే అసలైన సంపద: మంత్రి పొంగులేటి నిధుల వినియోగంలో ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి
12-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం, ప్రజా సేవలో భాగస్వామ్యం కావడం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతోనే ఈ స్థాయికి చేరుకున్నామని, పదవీ కాలం ముగిసే సమయానికి తమ గ్రామం, వార్డు అభివృద్ధి చెందిందని ప్రజలు గర్వంగా చెప్పేలా పని చేయాలని సూచించారు.

గురువారం ఖమ్మంలోని భక్త రామదాసు కాలక్షేత్రం లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇటీవలే పంచాయతీల ఖాతాల్లో గణనీయమైన నిధులు జమ అయ్యాయని, మార్చి చివరినాటికి మరిన్ని నిధులు అందనున్నాయని తెలిపారు. ఈ నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని సర్పంచులకు సూచించారు.

అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.

ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, గెలిచిన తర్వాత అందరూ ప్రజల సేవకులుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు. కొత్తగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులకు అధికారులు పూర్తి స్థాయిలో మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి ఆకాంక్షించారు.

Sthanikam

ప్రజా సేవే అసలైన సంపద: మంత్రి పొంగులేటి నిధుల వినియోగంలో ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి

Article Image

ఖమ్మం, ప్రజా సేవలో భాగస్వామ్యం కావడం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతోనే ఈ స్థాయికి చేరుకున్నామని, పదవీ కాలం ముగిసే సమయానికి తమ గ్రామం, వార్డు అభివృద్ధి చెందిందని ప్రజలు గర్వంగా చెప్పేలా పని చేయాలని సూచించారు.

గురువారం ఖమ్మంలోని భక్త రామదాసు కాలక్షేత్రం లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇటీవలే పంచాయతీల ఖాతాల్లో గణనీయమైన నిధులు జమ అయ్యాయని, మార్చి చివరినాటికి మరిన్ని నిధులు అందనున్నాయని తెలిపారు. ఈ నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని సర్పంచులకు సూచించారు.

అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.

ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, గెలిచిన తర్వాత అందరూ ప్రజల సేవకులుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు. కొత్తగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులకు అధికారులు పూర్తి స్థాయిలో మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News