ప్రజా సేవే అసలైన సంపద: మంత్రి పొంగులేటి నిధుల వినియోగంలో ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి
ప్రజా సేవే అసలైన సంపద: మంత్రి పొంగులేటి నిధుల వినియోగంలో ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి
స్థానికం బృందం
ఖమ్మం, ప్రజా సేవలో భాగస్వామ్యం కావడం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతోనే ఈ స్థాయికి చేరుకున్నామని, పదవీ కాలం ముగిసే సమయానికి తమ గ్రామం, వార్డు అభివృద్ధి చెందిందని ప్రజలు గర్వంగా చెప్పేలా పని చేయాలని సూచించారు.
గురువారం ఖమ్మంలోని భక్త రామదాసు కాలక్షేత్రం లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇటీవలే పంచాయతీల ఖాతాల్లో గణనీయమైన నిధులు జమ అయ్యాయని, మార్చి చివరినాటికి మరిన్ని నిధులు అందనున్నాయని తెలిపారు. ఈ నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని సర్పంచులకు సూచించారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.
ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, గెలిచిన తర్వాత అందరూ ప్రజల సేవకులుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు. కొత్తగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులకు అధికారులు పూర్తి స్థాయిలో మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి