ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి..
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి..
NM Yadav
ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం..
నల్గొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్లో గురువారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా వార్డు సభను ఘనంగా నిర్వహించారు. స్థానిక సమస్యల గుర్తింపు, అభివృద్ధి పనుల ప్రణాళికే లక్ష్యంగా జరిగిన ఈ సభకు డివిజన్ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ మాట్లాడుతూ.. వార్డులోని ప్రతి గల్లీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల ముంగిటకే పాలనను తీసుకురావడంలో భాగంగా ఈ 99 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
గతంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో పొరపాటున ఎవరైనా దరఖాస్తులు చేసుకోకపోయినా లేదా అప్లికేషన్లు మిస్ అయిన వారు ఉంటే నేరుగా తనను సంప్రదించి దరఖాస్తులు అందజేయాలని కార్పొరేటర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి (RO) శివరామిరెడ్డి, వార్డు ఆఫీసర్ యాదమ్మ, ఆర్.పి. సుజాత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వార్డు జవాన్ తిరుమల్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. సభకు హాజరై విజయవంతం చేసిన డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి