Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 04:48 PM

ప్రైవేట్ టీచర్లపై ప్రొఫెషనల్ టాక్స్ వసూలు హేయం

ప్రైవేట్ టీచర్లపై ప్రొఫెషనల్ టాక్స్ వసూలు హేయం

ప్రైవేట్ టీచర్లపై ప్రొఫెషనల్ టాక్స్ వసూలు హేయం
March 07, 2026 03:05 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

ప్రైవేట్ టీచర్స్ ఫోరం చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు కానుగు సతీష్

ప్రైవేట్ టీచర్ల నుంచి ప్రొఫెషనల్ టాక్స్ (వృత్తి పన్ను) వసూలు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు కానుగు సతీష్ డిమాండ్ చేశారు. అరకోర జీతాలతో దుర్భర జీవితం గడుపుతున్న ప్రైవేట్ టీచర్లపై వృత్తి పన్ను విధించడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అలాగే బడ్జెట్ పాఠశాలలకు కమర్షియల్ టాక్స్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఫిటీఎఫ్ యాదాద్రి జిల్లా కార్యదర్శి గుణమోని ఐలయ్య, ప్రైవేట్ ఉపాధ్యాయులు టి. వెంకటేశ్వర్లు, రమేష్, నాగమణి, ఇందిర, నాగు, బ్రహ్మచారి, నాయుడు, ఇంతియాజ్, శిల్ప, రవళి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News