Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 07:55 AM

ప్రైవేట్ టీచర్లపై ప్రొఫెషనల్ టాక్స్ వసూలు హేయం

ప్రైవేట్ టీచర్లపై ప్రొఫెషనల్ టాక్స్ వసూలు హేయం

ప్రైవేట్ టీచర్లపై ప్రొఫెషనల్ టాక్స్ వసూలు హేయం
March 07, 2026 03:05 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రైవేట్ టీచర్స్ ఫోరం చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు కానుగు సతీష్

ప్రైవేట్ టీచర్ల నుంచి ప్రొఫెషనల్ టాక్స్ (వృత్తి పన్ను) వసూలు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు కానుగు సతీష్ డిమాండ్ చేశారు. అరకోర జీతాలతో దుర్భర జీవితం గడుపుతున్న ప్రైవేట్ టీచర్లపై వృత్తి పన్ను విధించడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అలాగే బడ్జెట్ పాఠశాలలకు కమర్షియల్ టాక్స్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఫిటీఎఫ్ యాదాద్రి జిల్లా కార్యదర్శి గుణమోని ఐలయ్య, ప్రైవేట్ ఉపాధ్యాయులు టి. వెంకటేశ్వర్లు, రమేష్, నాగమణి, ఇందిర, నాగు, బ్రహ్మచారి, నాయుడు, ఇంతియాజ్, శిల్ప, రవళి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News