Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 08:00 AM

ప్రధాని మోది సభను విజయవంతం చేయాలి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

ప్రధాని మోది సభను విజయవంతం చేయాలి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

ప్రధాని మోది సభను విజయవంతం చేయాలి   కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు
May 08, 2026 08:35 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గురువారం యాకత్‌పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోది ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు రానున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, నిర్వహించనున్నారని పేర్కొన్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ, మాజీ కార్పొరేటర్లు జంగం శ్వేతారెడ్డి, కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, సీనియర్ నాయకులు సహదేవ్ యాదవ్, సంరెడ్డి సురేందర్ రెడ్డి, వీరేందర్ యాదవ్, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News