ప్రధాని మోది సభను విజయవంతం చేయాలి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపు
ప్రధాని మోది సభను విజయవంతం చేయాలి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపు
RAPOLU LINGASWAMY
ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గురువారం యాకత్పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశానికి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోది ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు రానున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, నిర్వహించనున్నారని పేర్కొన్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ, మాజీ కార్పొరేటర్లు జంగం శ్వేతారెడ్డి, కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, సీనియర్ నాయకులు సహదేవ్ యాదవ్, సంరెడ్డి సురేందర్ రెడ్డి, వీరేందర్ యాదవ్, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి