ప్రధాన మంత్రి సంసద్ క్రీడా మహోత్సవ వేడుకలు
ప్రధాన మంత్రి సంసద్ క్రీడా మహోత్సవ వేడుకలు
Sthanikam District Staff Reporter
భువనగిరి టౌన్: ప్రధాన మంత్రి సంసద్ క్రీడా మహోత్సవంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో వాలైబాల్ పోటీలు స్థానిక ఇండోర్ స్టేడియం లో పీఎం సంసద్ క్రీడా మహోత్సవం కో-ఆర్గనైజర్లు పడమటి జగన్మోహన్ రెడ్డి,పట్నం కపిల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది,ఈ వాలిబాల్ గేమ్ లో భువనగిరి,ఆలేరు,జనగాం,తుంగతుర్తి,నకిరేకల్,మునుగోడు,ఇబ్రహీంపట్నం క్రీడాకారులు ఆడారు ఉదయం 10 గంటలకు బిజెపి రాష్ట్ర నాయకులు పాశం భాస్కర్, పడాల శ్రీనివాస్, కడియం రామచందర్ లు ప్రారంభించారు సాయంత్రం 5 గంటలకు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు విచ్చేసి గెలిచిన ఇబ్రహీంపట్నం , రన్నర్స్ మునుగోడు కు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత అభివృద్ధి ద్వారా జాతి నిర్మాణం అనే మంత్రంతో క్రీడా ఉత్సవం బలమైన స్తంభంగా మారుతోందని ఆయన అన్నారు. గెలుపు ఓటములకు అతీతంగా,ఈ ఆటల ద్వారా అథ్లెట్లు నేర్చుకునే క్రీడా స్ఫూర్తి మరియు న్యాయమైన ఆట స్ఫూర్తి సమర్థులైన మరియు క్రమశిక్షణ కలిగిన యువత అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. ఈ సమర్థులైన మరియు క్రమశిక్షణ కలిగిన యువత దేశ భవిష్యత్తును నిర్మిస్తారని ఆయన అన్నారు.క్రీడలు కేవలం నేర్చుకోవడంలో ఒక భాగం మాత్రమే కాదని,ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడుకునేలా ప్రోత్సహించాలని, వారికి ఆడటానికి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యకరమైన శరీరం మరియు ఆరోగ్యకరమైన మనస్సుకు ఇది చాలా ముఖ్యమైన పరిస్థితి అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చందా మహేందర్,కొప్పుల యాదిరెడ్డి,పన్నాల చంద్రశేఖర్ రెడ్డి,రతపురం బలరాం,దయ్యాల కుమారస్వామి,కట్టక మోజు ఉషా కిరణ్,గుదే మధుసూదన్,కొలిచేలిమ మల్లికార్జున్,మరియాల వేణుమాధవ్,మల్లారెడ్డి,శత్రు నాయక్,రాము,గోవర్ధన్,దుర్గయ్య,పార్టీ నాయకులు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి