ప్రచార హోరు.. హిందూ సమ్మేళనం దిగ్విజయం చేయండి!
ప్రచార హోరు.. హిందూ సమ్మేళనం దిగ్విజయం చేయండి!
K.RAVI
చౌటుప్పల్లో భారీ బైక్ ర్యాలీ.. కేవీబీ కృష్ణారావు పిలుపు
ఈనెల 19న నిర్వహించనున్న 'మహా హిందూ సమ్మేళనం' విజయవంతం కోరుతూ శనివారం పట్టణంలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీని సమితి అధ్యక్షులు కేవీబీ కృష్ణారావు ప్రారంభించారు.ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదివారం జరగనున్న సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పూజ్యశ్రీ వాసుదేవానంద సరస్వతి, ముఖ్య వక్తగా జిన్నా సత్యనారాయణ రెడ్డి, మహిళా వక్తగా పర్వతం సంధ్యారాణి హాజరై మార్గదర్శనం చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్రతి ఇంటి నుంచి భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి కొసనం రాంరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాసులు సారథ్యంలో సాగిన ఈ ర్యాలీలో డాక్టర్ వేముల నరసింహ, కర్నాటి శ్యాం ప్రసాద్ సమన్వయకర్తలుగావ్యవహరించారు.ఈ కార్యక్రమంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం అధ్యక్షులు బొబ్బిళ్ల మురళి, శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు బడుగు జయప్రకాష్, మహిపాల్ రెడ్డి, జక్కర్తి శేఖర్, బత్తిని రఘు గౌడ్, విశ్వనాథ్, శ్రీనివాస్, బిజిలి నరేష్ , మునుకుంట్ల సత్యనారాయణ, గుర్రం వెంకటేశం, కాంసెట్టి చంద్రశేఖర్, భీమిడి మోహన్ రెడ్డి, బడుగు శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి