ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య; సర్పంచ్ మల్లేష్
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య; సర్పంచ్ మల్లేష్
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య ఉంటుందని సర్పంచ్ కలకలం మల్లేష్ అన్నారు. శుక్రవారంమండలం సంగేo గ్రామంలో మన ఊరి మనబడి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు. విద్యార్థులను చక్కటి విద్య అభ్యసన చేయడానికి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు ఉన్నాయని అన్నారు. గ్రామంలో తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి , వార్డు మెంబర్లు ఏస మల్ల భాగ్యమ్మ, దుబ్బాక విజయ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు యశమల్ల వెంకన్న ,జటంగి రవి, మండల పార్టీ ఉపాధ్యక్షులు మారగాని వెంకటయ్య, మల్యాల రాములు ,మాజీ ఉపసర్పంచ్ జటంగి అనిత లింగయ్య ,మాజీ సర్పంచ్ మల్లమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు నాగమ్మ, ఎస్ఎంసి చైర్మన్ సరిత జనార్ధన్ , కృష్ణ ,అంగన్వాడీ టీచర్లు, రమేష్, బాలరాజు, కిరణ్, రమేష్ ,నాగేష్, నాగరాజు, సత్తిరెడ్డి ,జగన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, బిక్షం, మల్లేష్ ,నాగయ్య ,లింగయ్య ,ప్రశాంతు, నరేష్, శ్రీను, నాగరాజు, బింగి సందీప్, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి