Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిరుమర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట రిపోర్టర్లు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 08:16 PM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
April 20, 2026 05:16 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపాలిటీలో ఘనంగా 'బడిబాట' ప్రారంభం

విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి

ఉచిత పాఠ్యపుస్తకాలు, పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బడిబాట' కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమాన్ని ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకూడదని, ఉపాధ్యాయులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సకల మౌలిక సదుపాయాలను కల్పించిందని గుర్తుచేశారు.​​విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ఆమె ఈ సందర్భంగా వివరించారు: పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్.నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారంగా రాగిజావ పంపిణీ.​మెరుగైన బోధనతో పాటు క్రీడలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన.

​"ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోంది. ప్రైవేటుకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, స్థానిక నాయకులు బాలకృష్ణారెడ్డి, వెంకటేష్, సంతోష్, శివాజీ, సాయికిరణ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News