Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:25 PM

ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. బడిబాటకు మంచి స్పందన

ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. బడిబాటకు మంచి స్పందన

ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. బడిబాటకు మంచి స్పందన
17-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ పెద్దలతో కలిసి నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది. ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా గత నెల 25న పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించి ప్రభుత్వ బడుల ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. అదే క్రమంలో శుక్రవారం గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, ఉపేందర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అధిక ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. దాతల సహకారంతో పాఠశాలలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పదిమంది విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధించడం విశేషమన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజన్ బాబు, శ్రీనివాసరావు, జ్యోతి, కృష్ణ, గోపాల్ రెడ్డి, స్వర్ణలత, సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ఏఏపిసి చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ, గ్రామ పెద్దలు పిట్ట రామ్ రెడ్డి, మడూరి సోమేశ్వరరావు, సామాజిక కార్యకర్త వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. బడిబాటకు మంచి స్పందన

Article Image

గ్రామ పెద్దలతో కలిసి నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది. ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా గత నెల 25న పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించి ప్రభుత్వ బడుల ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. అదే క్రమంలో శుక్రవారం గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, ఉపేందర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అధిక ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. దాతల సహకారంతో పాఠశాలలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పదిమంది విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధించడం విశేషమన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజన్ బాబు, శ్రీనివాసరావు, జ్యోతి, కృష్ణ, గోపాల్ రెడ్డి, స్వర్ణలత, సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ఏఏపిసి చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ, గ్రామ పెద్దలు పిట్ట రామ్ రెడ్డి, మడూరి సోమేశ్వరరావు, సామాజిక కార్యకర్త వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News