ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. బడిబాటకు మంచి స్పందన
ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. బడిబాటకు మంచి స్పందన
Editor Desk
గ్రామ పెద్దలతో కలిసి నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది. ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా గత నెల 25న పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించి ప్రభుత్వ బడుల ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. అదే క్రమంలో శుక్రవారం గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, ఉపేందర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అధిక ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. దాతల సహకారంతో పాఠశాలలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పదిమంది విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధించడం విశేషమన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజన్ బాబు, శ్రీనివాసరావు, జ్యోతి, కృష్ణ, గోపాల్ రెడ్డి, స్వర్ణలత, సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ నడిగోటి పాండు, ఏఏపిసి చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ, గ్రామ పెద్దలు పిట్ట రామ్ రెడ్డి, మడూరి సోమేశ్వరరావు, సామాజిక కార్యకర్త వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి