ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
స్థానికం బృందం
మోటకొండూర్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారా లేదా అని అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. ఆసుపత్రిలో ఎంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని, ఇంకా ఏమైనా పోస్టులు ఖాళీగా ఉన్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోజూ వచ్చే ఓపీ రోగుల సంఖ్య, వారికి అవసరమైన పరీక్షలు ఆసుపత్రి ల్యాబ్లోనే చేస్తున్నారా లేదా బయటకు పంపిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. ల్యాబ్లో నిర్వహిస్తున్న పరీక్షలు, రోగులకు అందిస్తున్న మందులు, వాటి నిల్వల వివరాలు స్టాక్ రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా లేదా అని కూడా పరిశీలించారు.
అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడిన కలెక్టర్ వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. చెకప్ కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇలా చేస్తే పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి