Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:24 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
11-03-2026 2,206 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోటకొండూర్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారా లేదా అని అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆసుపత్రిలో ఎంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని, ఇంకా ఏమైనా పోస్టులు ఖాళీగా ఉన్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోజూ వచ్చే ఓపీ రోగుల సంఖ్య, వారికి అవసరమైన పరీక్షలు ఆసుపత్రి ల్యాబ్‌లోనే చేస్తున్నారా లేదా బయటకు పంపిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షలు, రోగులకు అందిస్తున్న మందులు, వాటి నిల్వల వివరాలు స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారా లేదా అని కూడా పరిశీలించారు.

అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడిన కలెక్టర్ వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. చెకప్ కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇలా చేస్తే పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

Sthanikam

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మోటకొండూర్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారా లేదా అని అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆసుపత్రిలో ఎంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని, ఇంకా ఏమైనా పోస్టులు ఖాళీగా ఉన్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోజూ వచ్చే ఓపీ రోగుల సంఖ్య, వారికి అవసరమైన పరీక్షలు ఆసుపత్రి ల్యాబ్‌లోనే చేస్తున్నారా లేదా బయటకు పంపిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షలు, రోగులకు అందిస్తున్న మందులు, వాటి నిల్వల వివరాలు స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారా లేదా అని కూడా పరిశీలించారు.

అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడిన కలెక్టర్ వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. చెకప్ కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇలా చేస్తే పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News