Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 01:59 PM

ప్రభుత్వ ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ప్రభుత్వ ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ప్రభుత్వ ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
December 28, 2025 08:36 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు – 2025

విందు కార్యక్రమాలు, చర్చిలకు ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాలో క్రిస్మస్ వేడుకలు–2025ను భువనగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి, వలిగొండ, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో క్రైస్తవులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గానికి రూ.2 లక్షల వ్యయంతో క్రైస్తవులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే రిజిస్టర్ అయిన చర్చిలకు ఆర్థిక సహాయం కింద ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. భువనగిరి మరియు ఆలేరు నియోజకవర్గాల్లో కలిపి 100 చర్చిలకు మొత్తం రూ.30 లక్షలు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.

భువనగిరి మండలంలో నిర్వహించిన విందు కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, తహసిల్దార్‌తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ విధానాల ద్వారా అన్ని మతాలకు సమాన గౌరవం, సంబరాల నిర్వహణ జరుగుతున్నదని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాలు నియోజకవర్గంలో మత సామరస్యాన్ని మరింత బలపరిచాయని ప్రజలు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News