Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరెగూడెంలో ఉపాధి హామీ పనులకు శ్రీకారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 11:05 AM

పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
March 06, 2026 10:10 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అనంతపురం జిల్లా పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంటి రిజిస్ట్రేషన్ పనికి సంబంధించి రూ.25 వేల లంచం ప్రైవేటు వ్యక్తి వెంకటేశులు దగ్గర నుండి తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

వెంకటేశులు ఇచ్చిన సమాచారం ప్రకారం, సబ్‌ రిజిస్ట్రార్ రాధారమణ రూ.25 వేల లంచం తీసుకురావాలని చెప్పినట్లు అధికారులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కార్యాలయంలో విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా అనంతపురంలోని సబ్‌ రిజిస్ట్రార్ రాధారమణ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ అమిద్ ఖాన్ తెలిపారు. ఇంటికి తాళం వేసి తనిఖీలు కొనసాగిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News