Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 11:25 PM

పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
March 06, 2026 10:10 AM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అనంతపురం జిల్లా పామిడి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంటి రిజిస్ట్రేషన్ పనికి సంబంధించి రూ.25 వేల లంచం ప్రైవేటు వ్యక్తి వెంకటేశులు దగ్గర నుండి తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

వెంకటేశులు ఇచ్చిన సమాచారం ప్రకారం, సబ్‌ రిజిస్ట్రార్ రాధారమణ రూ.25 వేల లంచం తీసుకురావాలని చెప్పినట్లు అధికారులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కార్యాలయంలో విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా అనంతపురంలోని సబ్‌ రిజిస్ట్రార్ రాధారమణ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ అమిద్ ఖాన్ తెలిపారు. ఇంటికి తాళం వేసి తనిఖీలు కొనసాగిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News