ప్లాస్టిక్ తగ్గిద్దాం… భవిష్యత్తు కాపాడుదాం!
ప్లాస్టిక్ తగ్గిద్దాం… భవిష్యత్తు కాపాడుదాం!
K.RAVI
నీటి సంరక్షణ–చెట్ల పెంపకం–ఎకోబ్రిక్స్పై అవగాహన
పర్యావరణానికి, ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సహస్ర ఫౌండేషన్ అధ్యక్షుడు చినుకని యువరాజు పేర్కొన్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను తగ్గించి, పునర్వినియోగం, రీసైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చని తెలిపారు. పురపాలక కేంద్రంలోని గ్రీన్ గ్రోవ్ స్కూల్ లో జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నీరు వృథా కాకూడదు భూగర్భ జలాల సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటిలో నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.చెట్టు నాటితేనే జీవనాట్యం చెట్లను నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదేనని తెలిపారు. చెట్లు ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమని విద్యార్థులకు వివరించారు. ఎకోబ్రిక్స్తో ప్లాస్టిక్ నివారణ రోజువారీగా వాడే ప్లాస్టిక్ వ్యర్థాలను ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లలో నింపి ‘ఎకోబ్రిక్’లుగా తయారు చేసి పునర్వినియోగం చేయాలని సూచించారు. చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పుకు దారి తీస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్-కమ్-ప్రిన్సిపల్ ఎస్. లక్ష్మి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి