Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 09:51 PM

ప్లాస్టిక్ తగ్గిద్దాం… భవిష్యత్తు కాపాడుదాం!

ప్లాస్టిక్ తగ్గిద్దాం… భవిష్యత్తు కాపాడుదాం!

ప్లాస్టిక్ తగ్గిద్దాం… భవిష్యత్తు కాపాడుదాం!
March 04, 2026 07:56 PM 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నీటి సంరక్షణ–చెట్ల పెంపకం–ఎకోబ్రిక్స్‌పై అవగాహన

పర్యావరణానికి, ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సహస్ర ఫౌండేషన్ అధ్యక్షుడు చినుకని యువరాజు పేర్కొన్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను తగ్గించి, పునర్వినియోగం, రీసైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చని తెలిపారు. పురపాలక కేంద్రంలోని గ్రీన్ గ్రోవ్ స్కూల్ లో జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నీరు వృథా కాకూడదు భూగర్భ జలాల సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటిలో నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.చెట్టు నాటితేనే జీవనాట్యం చెట్లను నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదేనని తెలిపారు. చెట్లు ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమని విద్యార్థులకు వివరించారు. ఎకోబ్రిక్స్‌తో ప్లాస్టిక్ నివారణ రోజువారీగా వాడే ప్లాస్టిక్ వ్యర్థాలను ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లలో నింపి ‘ఎకోబ్రిక్’లుగా తయారు చేసి పునర్వినియోగం చేయాలని సూచించారు. చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పుకు దారి తీస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్-కమ్-ప్రిన్సిపల్ ఎస్. లక్ష్మి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News