Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:33 AM

పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో గందరగోళం

పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో గందరగోళం

పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో గందరగోళం
December 29, 2025 07:45 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన డివిజన్ల లోపాలు: బిఆర్ఎస్ పార్టీ ఆందోళన

హైదరాబాద్: స్థానికం ప్రతినిధి

కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల నిర్వహణపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ దండెం రాంరెడ్డి మాట్లాడుతూ, “ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఉన్నారా.. లేరా..? ప్రజలకు అర్థం కావడం లేదు” అని పేర్కొన్నారు.

రాంరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, వ్యవసాయం మీద ఆధారపడిన నాలుగు గ్రామాలను పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ లో కలిపి, జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకువచ్చడంతో గ్రామాల ప్రజలపై అదనపు టాక్స్ భారము పడుతోందని, అందువల్ల అనేక ప్రాంతాల్లో అయోమయ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఎల్బీనగర్ జోన్ లోని పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లను హయాత్నగర్ సర్కిల్ లో కలపాలని, నాగోల్ సర్కిల్ వద్ద కాకుండా పక్కన ఏర్పాటు చేయాలని సూచించారు.

రాంరెడ్డి తెలిపారు, పెద్ద అంబర్ పేట్ డివిజన్‌లో 55,000 పైచిలుకు, కుంట్లూరు డివిజన్‌లో 12,000 పైచిలుకు ఓటర్ల వ్యత్యాసం ఉంది. కుంట్లూరు ప్రాంతానికి రెవెన్యూ సదుపాయం లేకపోవడం, తట్టి అన్నారం కలిపి ఒక డివిజన్ చేయడం వల్ల లోపాలు ఏర్పడినట్టు తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ కు మెమోరాండం అందజేయడం జరిగినట్టు చెప్పారు.

రాంరెడ్డి స్థానిక ఎమ్మెల్యే పునరాలోచన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే కోర్టులో న్యాయపరంగా హక్కులు సాధిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఈదమ్మల్ల బలరాం, మాజీ సర్పంచ్ కళ్ళెం ప్రభాకర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు అర్చన దామోదర్, మండల కోటేశ్వర్ రావు, తొండెపు రోహిణి బ్రహ్మానంద రెడ్డి, దేసారం బాలకృష్ణ గౌడ్, పిల్లి నగేష్ యాదవ్, భాస్కర్ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు జోర్క రాము, గాదె శేఖర్, పత్తి రవికాంత్, ఊటుకూరి కర్నాకర్, గాయాల రాము, పండుగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News