Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:46 PM

పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో గందరగోళం

పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో గందరగోళం

పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో గందరగోళం
29-12-2025 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన డివిజన్ల లోపాలు: బిఆర్ఎస్ పార్టీ ఆందోళన

హైదరాబాద్: స్థానికం ప్రతినిధి

కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల నిర్వహణపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ దండెం రాంరెడ్డి మాట్లాడుతూ, “ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఉన్నారా.. లేరా..? ప్రజలకు అర్థం కావడం లేదు” అని పేర్కొన్నారు.

రాంరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, వ్యవసాయం మీద ఆధారపడిన నాలుగు గ్రామాలను పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ లో కలిపి, జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకువచ్చడంతో గ్రామాల ప్రజలపై అదనపు టాక్స్ భారము పడుతోందని, అందువల్ల అనేక ప్రాంతాల్లో అయోమయ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఎల్బీనగర్ జోన్ లోని పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లను హయాత్నగర్ సర్కిల్ లో కలపాలని, నాగోల్ సర్కిల్ వద్ద కాకుండా పక్కన ఏర్పాటు చేయాలని సూచించారు.

రాంరెడ్డి తెలిపారు, పెద్ద అంబర్ పేట్ డివిజన్‌లో 55,000 పైచిలుకు, కుంట్లూరు డివిజన్‌లో 12,000 పైచిలుకు ఓటర్ల వ్యత్యాసం ఉంది. కుంట్లూరు ప్రాంతానికి రెవెన్యూ సదుపాయం లేకపోవడం, తట్టి అన్నారం కలిపి ఒక డివిజన్ చేయడం వల్ల లోపాలు ఏర్పడినట్టు తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ కు మెమోరాండం అందజేయడం జరిగినట్టు చెప్పారు.

రాంరెడ్డి స్థానిక ఎమ్మెల్యే పునరాలోచన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే కోర్టులో న్యాయపరంగా హక్కులు సాధిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఈదమ్మల్ల బలరాం, మాజీ సర్పంచ్ కళ్ళెం ప్రభాకర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు అర్చన దామోదర్, మండల కోటేశ్వర్ రావు, తొండెపు రోహిణి బ్రహ్మానంద రెడ్డి, దేసారం బాలకృష్ణ గౌడ్, పిల్లి నగేష్ యాదవ్, భాస్కర్ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు జోర్క రాము, గాదె శేఖర్, పత్తి రవికాంత్, ఊటుకూరి కర్నాకర్, గాయాల రాము, పండుగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లలో గందరగోళం

Article Image

నూతన డివిజన్ల లోపాలు: బిఆర్ఎస్ పార్టీ ఆందోళన

హైదరాబాద్: స్థానికం ప్రతినిధి

కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల నిర్వహణపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ దండెం రాంరెడ్డి మాట్లాడుతూ, “ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఉన్నారా.. లేరా..? ప్రజలకు అర్థం కావడం లేదు” అని పేర్కొన్నారు.

రాంరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, వ్యవసాయం మీద ఆధారపడిన నాలుగు గ్రామాలను పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ లో కలిపి, జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకువచ్చడంతో గ్రామాల ప్రజలపై అదనపు టాక్స్ భారము పడుతోందని, అందువల్ల అనేక ప్రాంతాల్లో అయోమయ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఎల్బీనగర్ జోన్ లోని పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్లను హయాత్నగర్ సర్కిల్ లో కలపాలని, నాగోల్ సర్కిల్ వద్ద కాకుండా పక్కన ఏర్పాటు చేయాలని సూచించారు.

రాంరెడ్డి తెలిపారు, పెద్ద అంబర్ పేట్ డివిజన్‌లో 55,000 పైచిలుకు, కుంట్లూరు డివిజన్‌లో 12,000 పైచిలుకు ఓటర్ల వ్యత్యాసం ఉంది. కుంట్లూరు ప్రాంతానికి రెవెన్యూ సదుపాయం లేకపోవడం, తట్టి అన్నారం కలిపి ఒక డివిజన్ చేయడం వల్ల లోపాలు ఏర్పడినట్టు తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ కు మెమోరాండం అందజేయడం జరిగినట్టు చెప్పారు.

రాంరెడ్డి స్థానిక ఎమ్మెల్యే పునరాలోచన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే కోర్టులో న్యాయపరంగా హక్కులు సాధిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఈదమ్మల్ల బలరాం, మాజీ సర్పంచ్ కళ్ళెం ప్రభాకర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు అర్చన దామోదర్, మండల కోటేశ్వర్ రావు, తొండెపు రోహిణి బ్రహ్మానంద రెడ్డి, దేసారం బాలకృష్ణ గౌడ్, పిల్లి నగేష్ యాదవ్, భాస్కర్ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు జోర్క రాము, గాదె శేఖర్, పత్తి రవికాంత్, ఊటుకూరి కర్నాకర్, గాయాల రాము, పండుగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News