Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:11 AM

పదో తరగతి విద్యార్థినులకు లక్ష్య సాధనపై పోలీసుల అవగాహన ఎస్ఐ క్రాంతి కుమార్.

పదో తరగతి విద్యార్థినులకు లక్ష్య సాధనపై పోలీసుల అవగాహన ఎస్ఐ క్రాంతి కుమార్.

 పదో తరగతి విద్యార్థినులకు లక్ష్య సాధనపై పోలీసుల అవగాహన ఎస్ఐ క్రాంతి కుమార్.
06-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మోటివేషన్ పెంపొందించేందుకు తుంగతుర్తి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం తుంగతుర్తి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ‘లక్ష్యాలు సాధించడం’ అంశంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదువులో నిరంతరం కృషి చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా మనసుపెట్టి చదవాలని అన్నారు.

పాఠ్యాంశాల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని, శ్రద్ధతో, ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.

విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.




Sthanikam

పదో తరగతి విద్యార్థినులకు లక్ష్య సాధనపై పోలీసుల అవగాహన ఎస్ఐ క్రాంతి కుమార్.

Article Image

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మోటివేషన్ పెంపొందించేందుకు తుంగతుర్తి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం తుంగతుర్తి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ‘లక్ష్యాలు సాధించడం’ అంశంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదువులో నిరంతరం కృషి చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా మనసుపెట్టి చదవాలని అన్నారు.

పాఠ్యాంశాల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని, శ్రద్ధతో, ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.

విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News