పదో తరగతి విద్యార్థినులకు లక్ష్య సాధనపై పోలీసుల అవగాహన ఎస్ఐ క్రాంతి కుమార్.
పదో తరగతి విద్యార్థినులకు లక్ష్య సాధనపై పోలీసుల అవగాహన ఎస్ఐ క్రాంతి కుమార్.
Bandi Kiran Kumar
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మోటివేషన్ పెంపొందించేందుకు తుంగతుర్తి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం తుంగతుర్తి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ‘లక్ష్యాలు సాధించడం’ అంశంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదువులో నిరంతరం కృషి చేయాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా మనసుపెట్టి చదవాలని అన్నారు.
పాఠ్యాంశాల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని, శ్రద్ధతో, ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.
విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి