పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.
పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.
Sandeep journalist
ప్రతీ ఆదివారం పెద్దమ్మ తల్లి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ
అందోల్, స్థానికం ప్రతినిధి.
జోగిపేట పట్టణం కు దగ్గర లోని మాసానీ పల్లి గ్రామంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డి బి నాగభూషణం, బిఆరెస్ నాయకులు చాపల వెంకటేశం.
అందోల్ నియోజక వర్గం బిఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి. నారాయణ ముదిరాజ్ ఎంతో పట్టుదలతో శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయం నిర్మాణం కోసం కృషి చేసి అందరు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేయడం జరగింది. ఎంతో మహిమాన్వితము అయిన అమ్మ వారిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి ఆదివారం దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాసానిపల్లి, జోగిపేటతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి