ఓటరు జాబితా సవరణలో వేగం పెంచండి. సుదర్శన్ రెడ్డి
ఓటరు జాబితా సవరణలో వేగం పెంచండి. సుదర్శన్ రెడ్డి
Editor Desk
హైదరాబాద్,
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా పూర్తైందని, తెలంగాణలో కూడా అదే స్థాయిలో పనులు పూర్తి చేసేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్వోలు తమ పరిధిలోని బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓలు), సూపర్వైజర్లకు స్పష్టమైన మార్గనిర్దేశం ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకంపై ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో, వారి సహకారాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పరిధిలోని బిఎల్ఓలతో సమన్వయం పెంచుకుని మ్యాపింగ్ పనులను స్వయంగా పర్యవేక్షిస్తే మిగిలిన ప్రాంతాల్లో పనులు త్వరితగతిన పూర్తి అవుతాయని వివరించారు. ఈ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి పాల్గొన్నారు. అలాగే భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్, ఎలక్షన్స్ సెల్ సూపరింటెండెంట్ కృష్ణ తదితర అధికారులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి