Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 05:00 AM

ఓటరు జాబితా సవరణలో వేగం పెంచండి. సుదర్శన్ రెడ్డి

ఓటరు జాబితా సవరణలో వేగం పెంచండి. సుదర్శన్ రెడ్డి

ఓటరు జాబితా సవరణలో వేగం పెంచండి. సుదర్శన్ రెడ్డి
April 20, 2026 07:42 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా పూర్తైందని, తెలంగాణలో కూడా అదే స్థాయిలో పనులు పూర్తి చేసేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్వోలు తమ పరిధిలోని బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓలు), సూపర్వైజర్లకు స్పష్టమైన మార్గనిర్దేశం ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకంపై ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో, వారి సహకారాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పరిధిలోని బిఎల్ఓలతో సమన్వయం పెంచుకుని మ్యాపింగ్ పనులను స్వయంగా పర్యవేక్షిస్తే మిగిలిన ప్రాంతాల్లో పనులు త్వరితగతిన పూర్తి అవుతాయని వివరించారు. ఈ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి పాల్గొన్నారు. అలాగే భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్, ఎలక్షన్స్ సెల్ సూపరింటెండెంట్ కృష్ణ తదితర అధికారులు హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News