Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 01:08 PM

ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్‌పై దాడులు

ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్‌పై దాడులు

ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్‌పై దాడులు
January 19, 2026 06:34 PM 200 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాధవరం గ్రామంలో గడ్డివాము దగ్ధం

మునగాల:

మునగాల మండలం మాధవరం గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడవ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మున్నా లింగయ్య ఘన విజయం సాధించారు. అలాగే గ్రామ సర్పంచ్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.ఈ నేపథ్యంలో లింగయ్య తమ పశువుల కోసం సేకరించుకున్న గడ్డివామును ప్రత్యర్థులు రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసి దగ్ధం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.సమాచారం అందుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దగ్ధమైన గడ్డివామును పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో జీర్ణించుకోలేని ప్రత్యర్థులు గ్రామాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులను ప్రజలు ఖండించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News