ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్పై దాడులు
ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్పై దాడులు
Editor Desk
మాధవరం గ్రామంలో గడ్డివాము దగ్ధం
మునగాల:
మునగాల మండలం మాధవరం గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడవ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మున్నా లింగయ్య ఘన విజయం సాధించారు. అలాగే గ్రామ సర్పంచ్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.ఈ నేపథ్యంలో లింగయ్య తమ పశువుల కోసం సేకరించుకున్న గడ్డివామును ప్రత్యర్థులు రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసి దగ్ధం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.సమాచారం అందుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దగ్ధమైన గడ్డివామును పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో జీర్ణించుకోలేని ప్రత్యర్థులు గ్రామాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులను ప్రజలు ఖండించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి