Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటర్ ఫలితాల్లో నారాయణ జూనియర్ కళాశాల సంచలన విజయం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 12:05 PM

ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్‌పై దాడులు

ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్‌పై దాడులు

ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్‌పై దాడులు
January 19, 2026 06:34 PM 194 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాధవరం గ్రామంలో గడ్డివాము దగ్ధం

మునగాల:

మునగాల మండలం మాధవరం గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడవ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మున్నా లింగయ్య ఘన విజయం సాధించారు. అలాగే గ్రామ సర్పంచ్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.ఈ నేపథ్యంలో లింగయ్య తమ పశువుల కోసం సేకరించుకున్న గడ్డివామును ప్రత్యర్థులు రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసి దగ్ధం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.సమాచారం అందుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దగ్ధమైన గడ్డివామును పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో జీర్ణించుకోలేని ప్రత్యర్థులు గ్రామాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులను ప్రజలు ఖండించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News