Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 06:16 AM

నూజివీడులో మామిడి కొనుగోలుదారులు–విక్రేతల సమావేశం

నూజివీడులో మామిడి కొనుగోలుదారులు–విక్రేతల సమావేశం

నూజివీడులో మామిడి కొనుగోలుదారులు–విక్రేతల సమావేశం
March 08, 2026 12:48 PM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


నూజివీడు: ఏలూరు జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి ఉత్పత్తిదారులు మరియు కొనుగోలుదారుల అనుసంధాన సదస్సు “నూజివీడు మామిడి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్–2026” ఈ నెల 10వ తేదీ మంగళవారం నిర్వహించనున్నారు. నూజివీడు పట్టణంలోని కోనేరుపేటలో ఉన్న టి.టి.డి కళ్యాణ మండపంలో ఈ సదస్సు జరగనుంది.

ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

గౌరవ అతిథులుగా ఫుడ్ ప్రాసెసింగ్ సోసైటి ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఐఎఫ్‌ఎస్ రిటైర్డ్) చిరంజీవి చౌదరి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్ హరినాథ్ రెడ్డి పాల్గొంటారు.

అలాగే డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం పరిశోధన విభాగం డైరెక్టర్ జి. రామనందం, నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బి. కనకమహాలక్ష్మి, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. రామ్మోహన్ కూడా పాల్గొని రైతులకు మార్గదర్శనం చేయనున్నారు.

జిల్లా ఉద్యాన అధికారి కె. షాజానాయక్, నూజివీడు ఉద్యాన అధికారిణి ఆర్. హేమ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వ్యవహరిస్తున్నారు. మామిడి రైతులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News