Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ… భువనగిరిలో ఆర్‌సెటి ప్రారంభం. కలెక్టర్ “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 06:36 PM

నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం

నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం

నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం
March 30, 2026 04:54 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నియోజకవర్గ సాధన దిశగా కసరత్తులు వేగం పుంజుకుంటున్నాయి. రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో పల్లివాడ, ఎల్లంకి, సర్నేనిగూడెం గ్రామాల సర్పంచులకు ఘన సన్మానం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల ఎన్నికైన పల్లివాడ సర్పంచ్ ఖమ్మంపాటి శ్రీనివాస్, ఎల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, సర్నేనిగూడెం సర్పంచ్ గంగాదేవి స్వామి గార్లను సన్మానిస్తూ, నియోజకవర్గ సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ… రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించడం లక్ష్యంగా సమితి కృషి చేస్తోందని తెలిపారు. ఈ దిశగా గ్రామాల ప్రజాప్రతినిధుల సహకారం కీలకమని పేర్కొన్నారు. సర్పంచులతో జరిగిన చర్చలో వారు సానుకూలంగా స్పందిస్తూ, రామన్నపేటను నియోజకవర్గంగా చూడాలని తమకూ ఆకాంక్ష ఉందని, ఈ ఉద్యమంలో భాగస్వాములమై సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో పోషబోయిన మల్లేశం, సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, ఏండి ఫజల్, నకరెకంటి అశోక్, బోయిన ఆనంద్, పెండెం రవీందర్, పోచబోయిన మల్లేష్, దండుగుల రాములు, వనం చంద్రమౌళి, శ్రీరామోజీ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News