నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం
నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నియోజకవర్గ సాధన దిశగా కసరత్తులు వేగం పుంజుకుంటున్నాయి. రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో పల్లివాడ, ఎల్లంకి, సర్నేనిగూడెం గ్రామాల సర్పంచులకు ఘన సన్మానం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల ఎన్నికైన పల్లివాడ సర్పంచ్ ఖమ్మంపాటి శ్రీనివాస్, ఎల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, సర్నేనిగూడెం సర్పంచ్ గంగాదేవి స్వామి గార్లను సన్మానిస్తూ, నియోజకవర్గ సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ… రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించడం లక్ష్యంగా సమితి కృషి చేస్తోందని తెలిపారు. ఈ దిశగా గ్రామాల ప్రజాప్రతినిధుల సహకారం కీలకమని పేర్కొన్నారు. సర్పంచులతో జరిగిన చర్చలో వారు సానుకూలంగా స్పందిస్తూ, రామన్నపేటను నియోజకవర్గంగా చూడాలని తమకూ ఆకాంక్ష ఉందని, ఈ ఉద్యమంలో భాగస్వాములమై సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో పోషబోయిన మల్లేశం, సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, ఏండి ఫజల్, నకరెకంటి అశోక్, బోయిన ఆనంద్, పెండెం రవీందర్, పోచబోయిన మల్లేష్, దండుగుల రాములు, వనం చంద్రమౌళి, శ్రీరామోజీ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి