Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:43 PM

నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం

నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం

నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం
30-03-2026 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నియోజకవర్గ సాధన దిశగా కసరత్తులు వేగం పుంజుకుంటున్నాయి. రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో పల్లివాడ, ఎల్లంకి, సర్నేనిగూడెం గ్రామాల సర్పంచులకు ఘన సన్మానం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల ఎన్నికైన పల్లివాడ సర్పంచ్ ఖమ్మంపాటి శ్రీనివాస్, ఎల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, సర్నేనిగూడెం సర్పంచ్ గంగాదేవి స్వామి గార్లను సన్మానిస్తూ, నియోజకవర్గ సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ… రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించడం లక్ష్యంగా సమితి కృషి చేస్తోందని తెలిపారు. ఈ దిశగా గ్రామాల ప్రజాప్రతినిధుల సహకారం కీలకమని పేర్కొన్నారు. సర్పంచులతో జరిగిన చర్చలో వారు సానుకూలంగా స్పందిస్తూ, రామన్నపేటను నియోజకవర్గంగా చూడాలని తమకూ ఆకాంక్ష ఉందని, ఈ ఉద్యమంలో భాగస్వాములమై సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో పోషబోయిన మల్లేశం, సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, ఏండి ఫజల్, నకరెకంటి అశోక్, బోయిన ఆనంద్, పెండెం రవీందర్, పోచబోయిన మల్లేష్, దండుగుల రాములు, వనం చంద్రమౌళి, శ్రీరామోజీ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నియోజకవర్గ సాధన దిశగా అడుగులు… సర్పంచులకు సన్మానం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నియోజకవర్గ సాధన దిశగా కసరత్తులు వేగం పుంజుకుంటున్నాయి. రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో పల్లివాడ, ఎల్లంకి, సర్నేనిగూడెం గ్రామాల సర్పంచులకు ఘన సన్మానం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల ఎన్నికైన పల్లివాడ సర్పంచ్ ఖమ్మంపాటి శ్రీనివాస్, ఎల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, సర్నేనిగూడెం సర్పంచ్ గంగాదేవి స్వామి గార్లను సన్మానిస్తూ, నియోజకవర్గ సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ… రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించడం లక్ష్యంగా సమితి కృషి చేస్తోందని తెలిపారు. ఈ దిశగా గ్రామాల ప్రజాప్రతినిధుల సహకారం కీలకమని పేర్కొన్నారు. సర్పంచులతో జరిగిన చర్చలో వారు సానుకూలంగా స్పందిస్తూ, రామన్నపేటను నియోజకవర్గంగా చూడాలని తమకూ ఆకాంక్ష ఉందని, ఈ ఉద్యమంలో భాగస్వాములమై సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో పోషబోయిన మల్లేశం, సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, ఏండి ఫజల్, నకరెకంటి అశోక్, బోయిన ఆనంద్, పెండెం రవీందర్, పోచబోయిన మల్లేష్, దండుగుల రాములు, వనం చంద్రమౌళి, శ్రీరామోజీ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News