నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు
నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు
స్థానికం బృందం
వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
భువనగిరి, మార్చి 7: నిషేధిత భూములు, నిషేధిత ఇండ్ల (నాల భూములు) జాబితా విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఆర్డీవో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజిస్ట్రేషన్ యాక్ట్–1908 సెక్షన్ 22–A ప్రకారం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీల జాబితా చాలా కాలంగా అమల్లో ఉందని స్పష్టం చేశారు.
నిషేధిత జాబితాలో ఇవే
ప్రభుత్వ భూములు, చెరువు శికం భూములు, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములు కూడా ఈ జాబితాలో ఉంటాయని పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల భూములూ నిషేధమే
రోడ్లు, రైల్వేలు, నీటి పారుదల ప్రాజెక్టులు, కాలువలు, వీకర్ సెక్షన్ ఇండ్ల స్థలాలు, 2 బీహెచ్కే ఇండ్ల కోసం సేకరించిన భూములు కూడా సెక్షన్ 22–A కింద ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
లావుని పట్టా భూములపై కొనుగోలు–అమ్మకాలు నిషేధం
స్వాతంత్ర్యం తర్వాత భూమిలేని నిరుపేదలకు కేటాయించిన లావుని పట్టా భూములు అమ్మకం, కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఆ భూములు వారసులకు మాత్రమే చెందేలా ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేస్తోందని చెప్పారు.
దుష్ప్రచారంపై హెచ్చరిక
ఈ విషయంపై కొందరు వ్యక్తులు ప్రజల్లో భయం, అపోహలు కలిగించేలా వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి