Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 05:21 AM

నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు

నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు

నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు
March 08, 2026 05:27 AM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాట్సాప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

భువనగిరి, మార్చి 7: నిషేధిత భూములు, నిషేధిత ఇండ్ల (నాల భూములు) జాబితా విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఆర్డీవో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజిస్ట్రేషన్ యాక్ట్–1908 సెక్షన్ 22–A ప్రకారం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీల జాబితా చాలా కాలంగా అమల్లో ఉందని స్పష్టం చేశారు.

నిషేధిత జాబితాలో ఇవే

ప్రభుత్వ భూములు, చెరువు శికం భూములు, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములు కూడా ఈ జాబితాలో ఉంటాయని పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల భూములూ నిషేధమే

రోడ్లు, రైల్వేలు, నీటి పారుదల ప్రాజెక్టులు, కాలువలు, వీకర్ సెక్షన్ ఇండ్ల స్థలాలు, 2 బీహెచ్‌కే ఇండ్ల కోసం సేకరించిన భూములు కూడా సెక్షన్ 22–A కింద ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

లావుని పట్టా భూములపై కొనుగోలు–అమ్మకాలు నిషేధం

స్వాతంత్ర్యం తర్వాత భూమిలేని నిరుపేదలకు కేటాయించిన లావుని పట్టా భూములు అమ్మకం, కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఆ భూములు వారసులకు మాత్రమే చెందేలా ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేస్తోందని చెప్పారు.

దుష్ప్రచారంపై హెచ్చరిక

ఈ విషయంపై కొందరు వ్యక్తులు ప్రజల్లో భయం, అపోహలు కలిగించేలా వాట్సాప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News