Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 04:58 AM

నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు

నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు

నిషేధిత భూములపై దుష్ప్రచారం నమ్మొద్దు
March 08, 2026 05:27 AM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాట్సాప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

భువనగిరి, మార్చి 7: నిషేధిత భూములు, నిషేధిత ఇండ్ల (నాల భూములు) జాబితా విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఆర్డీవో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజిస్ట్రేషన్ యాక్ట్–1908 సెక్షన్ 22–A ప్రకారం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీల జాబితా చాలా కాలంగా అమల్లో ఉందని స్పష్టం చేశారు.

నిషేధిత జాబితాలో ఇవే

ప్రభుత్వ భూములు, చెరువు శికం భూములు, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములు కూడా ఈ జాబితాలో ఉంటాయని పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల భూములూ నిషేధమే

రోడ్లు, రైల్వేలు, నీటి పారుదల ప్రాజెక్టులు, కాలువలు, వీకర్ సెక్షన్ ఇండ్ల స్థలాలు, 2 బీహెచ్‌కే ఇండ్ల కోసం సేకరించిన భూములు కూడా సెక్షన్ 22–A కింద ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

లావుని పట్టా భూములపై కొనుగోలు–అమ్మకాలు నిషేధం

స్వాతంత్ర్యం తర్వాత భూమిలేని నిరుపేదలకు కేటాయించిన లావుని పట్టా భూములు అమ్మకం, కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఆ భూములు వారసులకు మాత్రమే చెందేలా ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేస్తోందని చెప్పారు.

దుష్ప్రచారంపై హెచ్చరిక

ఈ విషయంపై కొందరు వ్యక్తులు ప్రజల్లో భయం, అపోహలు కలిగించేలా వాట్సాప్‌ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News