నిరుద్యోగులను మోసం చేయడం ఆపాలి: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్
నిరుద్యోగులను మోసం చేయడం ఆపాలి: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్
Editor Desk
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలో డివైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు.
గత ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుందని అన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులు తగిన విధంగా ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గద్దపాటి సుధాకర్, పొన్న సురేష్, మల్లేష్, శ్రీనివాస్, వేణు, నాగరాజు, రమేష్, సాయి, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి