Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:09 PM

నిరుద్యోగులను మోసం చేయడం ఆపాలి: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్

నిరుద్యోగులను మోసం చేయడం ఆపాలి: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్

నిరుద్యోగులను మోసం చేయడం ఆపాలి: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్
April 01, 2026 04:37 PM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలో డివైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు.

గత ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుందని అన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగులు తగిన విధంగా ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గద్దపాటి సుధాకర్, పొన్న సురేష్, మల్లేష్, శ్రీనివాస్, వేణు, నాగరాజు, రమేష్, సాయి, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News