Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానాలు మార్చుకోవాలి: వ్యవసాయ శాఖ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 24, 2026 04:37 PM

నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి

నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి

నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలి
July 24, 2026 01:56 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలి: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి


సూర్యాపేట పట్టణం లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 40వ వార్డు పెన్షనర్స్ భవన్‌లో ఏర్పాటు చేసిన బూత్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వెంకన్నతో కలిసి ఆయన పరిశీలించారు.


ఈ సందర్భంగా బీఎల్‌వోల పనితీరు, ఓటర్ల నమోదు, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ తదితర అంశాలను సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు.


ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన తిరిగి స్వీకరించి, డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, 40వ వార్డు కౌన్సిలర్ కొనతం రాజేష్ రెడ్డి, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బషీర్, సాయిరాం, పోతు నవీన్, సంపత్, రఫీ, వేల్పుల శివ, నాగేల్లి అరుణ్ కుమార్, అక్కేనపల్లి జానయ్య, మద్దెబోయిన శ్రీనివాస్, పడిదల రవి, నరేందర్ నాయుడు, ఖమ్మంపాటి మధుకర్, దండా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News