Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:27 PM

నిదానపల్లిలో ఫెర్టిలిటీ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

నిదానపల్లిలో ఫెర్టిలిటీ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

నిదానపల్లిలో ఫెర్టిలిటీ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య
March 04, 2026 10:53 AM 315 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గర్భకోశ వ్యాధులపై ముందస్తు వైద్యం – నిదానపల్లిలో ఫెర్టిలిటీ క్యాంప్‌కు మంచి స్పందన

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఫెర్టిలిటీ క్యాంప్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గేదెలు, ఆవుల్లో గర్భకోశ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స చేయించడం ద్వారా రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. పశువుల సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడితే రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు.

శిబిరంలో 35 గేదెలు, 15 ఆవులకు చూడి పరీక్షలు నిర్వహించి గర్భకోశ వ్యాధులను గుర్తించి తగిన వైద్యం అందించారు. అలాగే 25 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశువుల్లో అంతర పరానా జీవుల సమస్య నివారణకు అవసరమైన ఔషధాలు .

మండల పశువైద్యాధికారిణి డాక్టర్ జోత్స్న వైద్య అందించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండ అండాలు మల్లేష్, వార్డు సభ్యులు భాష మల్ల అనిత సంతోష్, వర్కాల వినయ్, వంగాల పూజిత, కడారి ఐలయ్య, గ్రామ పెద్దలు బొడిగ రంగయ్య సంకు లింగయ్య, కడారి ఆంజనేయులు పబ్బతి ఆంజనేయులు గోపాలమిత్రలు రాజేందర్, సురేష్, సూపర్వైజర్ శ్రీను పాల్గొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News