Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:49 PM

నిదానపల్లిలో ఫెర్టిలిటీ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

నిదానపల్లిలో ఫెర్టిలిటీ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

నిదానపల్లిలో ఫెర్టిలిటీ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య
04-03-2026 322 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గర్భకోశ వ్యాధులపై ముందస్తు వైద్యం – నిదానపల్లిలో ఫెర్టిలిటీ క్యాంప్‌కు మంచి స్పందన

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఫెర్టిలిటీ క్యాంప్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గేదెలు, ఆవుల్లో గర్భకోశ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స చేయించడం ద్వారా రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. పశువుల సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడితే రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు.

శిబిరంలో 35 గేదెలు, 15 ఆవులకు చూడి పరీక్షలు నిర్వహించి గర్భకోశ వ్యాధులను గుర్తించి తగిన వైద్యం అందించారు. అలాగే 25 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశువుల్లో అంతర పరానా జీవుల సమస్య నివారణకు అవసరమైన ఔషధాలు .

మండల పశువైద్యాధికారిణి డాక్టర్ జోత్స్న వైద్య అందించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండ అండాలు మల్లేష్, వార్డు సభ్యులు భాష మల్ల అనిత సంతోష్, వర్కాల వినయ్, వంగాల పూజిత, కడారి ఐలయ్య, గ్రామ పెద్దలు బొడిగ రంగయ్య సంకు లింగయ్య, కడారి ఆంజనేయులు పబ్బతి ఆంజనేయులు గోపాలమిత్రలు రాజేందర్, సురేష్, సూపర్వైజర్ శ్రీను పాల్గొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

Sthanikam

నిదానపల్లిలో ఫెర్టిలిటీ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

Article Image

గర్భకోశ వ్యాధులపై ముందస్తు వైద్యం – నిదానపల్లిలో ఫెర్టిలిటీ క్యాంప్‌కు మంచి స్పందన

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఫెర్టిలిటీ క్యాంప్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గేదెలు, ఆవుల్లో గర్భకోశ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స చేయించడం ద్వారా రైతులకు కలిగే ఆర్థిక నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. పశువుల సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడితే రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు.

శిబిరంలో 35 గేదెలు, 15 ఆవులకు చూడి పరీక్షలు నిర్వహించి గర్భకోశ వ్యాధులను గుర్తించి తగిన వైద్యం అందించారు. అలాగే 25 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశువుల్లో అంతర పరానా జీవుల సమస్య నివారణకు అవసరమైన ఔషధాలు .

మండల పశువైద్యాధికారిణి డాక్టర్ జోత్స్న వైద్య అందించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండ అండాలు మల్లేష్, వార్డు సభ్యులు భాష మల్ల అనిత సంతోష్, వర్కాల వినయ్, వంగాల పూజిత, కడారి ఐలయ్య, గ్రామ పెద్దలు బొడిగ రంగయ్య సంకు లింగయ్య, కడారి ఆంజనేయులు పబ్బతి ఆంజనేయులు గోపాలమిత్రలు రాజేందర్, సురేష్, సూపర్వైజర్ శ్రీను పాల్గొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News