Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:32 PM

నిబంధనల ప్రకారమే నామినేషన్‌ల స్వీకరణ జరగాలి

నిబంధనల ప్రకారమే నామినేషన్‌ల స్వీకరణ జరగాలి

నిబంధనల ప్రకారమే నామినేషన్‌ల స్వీకరణ జరగాలి
29-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చౌటుప్పల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు.గురువారం చౌటుప్పల్, పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాల్లో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్‌ల సంఖ్యతో పాటు ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ నిబంధనల ప్రకారం సాగుతోందా లేదా అన్న అంశాన్ని సవివరంగా పరిశీలించారు.

నామినేషన్‌ల స్వీకరణ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, సహాయ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు, సంబంధిత రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్‌లు సమర్పించే సమయంలో చిన్నపాటి పొరపాట్లకూ అవకాశం లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.అలాగే నామినేషన్ పత్రాలకు జతచేయాల్సిన ధ్రువపత్రాలు పూర్తిగా, సక్రమంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించాలని ఆదేశించారు. నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగేలా అప్రమత్తంగా వ్యవహరించాలని, నిబంధనల అమలులో కట్టుదిట్టంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంబంధిత నివేదికలను నిర్దేశిత విధానంలో సమయానికి నమోదు చేయాలన్నారు.

Sthanikam

నిబంధనల ప్రకారమే నామినేషన్‌ల స్వీకరణ జరగాలి

Article Image
చౌటుప్పల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు.గురువారం చౌటుప్పల్, పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాల్లో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్‌ల సంఖ్యతో పాటు ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ నిబంధనల ప్రకారం సాగుతోందా లేదా అన్న అంశాన్ని సవివరంగా పరిశీలించారు.

నామినేషన్‌ల స్వీకరణ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, సహాయ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు, సంబంధిత రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్‌లు సమర్పించే సమయంలో చిన్నపాటి పొరపాట్లకూ అవకాశం లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.అలాగే నామినేషన్ పత్రాలకు జతచేయాల్సిన ధ్రువపత్రాలు పూర్తిగా, సక్రమంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించాలని ఆదేశించారు. నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగేలా అప్రమత్తంగా వ్యవహరించాలని, నిబంధనల అమలులో కట్టుదిట్టంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంబంధిత నివేదికలను నిర్దేశిత విధానంలో సమయానికి నమోదు చేయాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News