నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్ ఐ నాగరాజు
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్ ఐ నాగరాజు
Editor Desk
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు:
ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై నాగరాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నరసింహులగూడెం గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ ప్రచారం 3వ విడత చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు గ్రామస్తులకు ట్రాఫిక్ నియమాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, కుటుంబాలపై పడే ప్రభావం, చట్టపరమైన చర్యల గురించి వివరించారు. క్షణిక నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు.
అలాగే మొబైల్ వాడకం, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలను నివారించాలని సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఎస్సై నాగరాజు పిలుపునిచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి