Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:12 PM

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్ ఐ నాగరాజు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్ ఐ నాగరాజు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్ ఐ నాగరాజు
March 29, 2026 03:40 PM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు:

ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై నాగరాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నరసింహులగూడెం గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ ప్రచారం 3వ విడత చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు గ్రామస్తులకు ట్రాఫిక్ నియమాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, కుటుంబాలపై పడే ప్రభావం, చట్టపరమైన చర్యల గురించి వివరించారు. క్షణిక నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు.

అలాగే మొబైల్ వాడకం, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలను నివారించాలని సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఎస్సై నాగరాజు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News