Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:13 AM

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్ ఐ నాగరాజు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్ ఐ నాగరాజు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్ ఐ నాగరాజు
March 29, 2026 03:40 PM 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు:

ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై నాగరాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నరసింహులగూడెం గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ ప్రచారం 3వ విడత చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు గ్రామస్తులకు ట్రాఫిక్ నియమాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, కుటుంబాలపై పడే ప్రభావం, చట్టపరమైన చర్యల గురించి వివరించారు. క్షణిక నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు.

అలాగే మొబైల్ వాడకం, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలను నివారించాలని సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఎస్సై నాగరాజు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News