Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వ్యవసాయ సంక్షోభంపై సమరశీల ఉద్యమాలకు పిలుపు “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 11:37 AM

నేటి నుంచి జాతీయ రహదారులపై కఠిన టోల్‌ నిబంధనలు అమలు

నేటి నుంచి జాతీయ రహదారులపై కఠిన టోల్‌ నిబంధనలు అమలు

నేటి నుంచి జాతీయ రహదారులపై కఠిన టోల్‌ నిబంధనలు అమలు
April 15, 2026 09:20 AM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి కొత్త టోల్‌ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాణిజ్య వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

కొత్త నిబంధనల ప్రకారం, వాహనం అనుమతించిన లోడుతో పోలిస్తే 10 నుంచి 40 శాతం వరకు అధికంగా లోడ్‌ తీసుకెళ్తే, సాధారణ టోల్‌ రుసుముకు రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 40 శాతం కంటే ఎక్కువ ఓవర్‌లోడ్‌ ఉన్న వాహనాలపై మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. అలాంటి వాహనాలకు టోల్‌ రుసుము నాలుగు రెట్లు వసూలు చేయనున్నారు.ఈ నిర్ణయం ద్వారా రహదారుల దెబ్బతినడం తగ్గించడంతో పాటు, రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తరచుగా ఓవర్‌లోడ్‌ కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా వెయింగ్‌ మెషీన్ల ద్వారా వాహనాల బరువును తనిఖీ చేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎటువంటి రాయితీలు ఉండవని స్పష్టం చేశారు.ఈ కొత్త రూల్స్ అమలుతో ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో కొంత మార్పు రావచ్చని, వాహనదారులు కూడా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News