నేటి నుంచి జాతీయ రహదారులపై కఠిన టోల్ నిబంధనలు అమలు
నేటి నుంచి జాతీయ రహదారులపై కఠిన టోల్ నిబంధనలు అమలు
Komidala Mahender reddy
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి కొత్త టోల్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఓవర్లోడ్తో వెళ్లే వాణిజ్య వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
కొత్త నిబంధనల ప్రకారం, వాహనం అనుమతించిన లోడుతో పోలిస్తే 10 నుంచి 40 శాతం వరకు అధికంగా లోడ్ తీసుకెళ్తే, సాధారణ టోల్ రుసుముకు రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 40 శాతం కంటే ఎక్కువ ఓవర్లోడ్ ఉన్న వాహనాలపై మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. అలాంటి వాహనాలకు టోల్ రుసుము నాలుగు రెట్లు వసూలు చేయనున్నారు.ఈ నిర్ణయం ద్వారా రహదారుల దెబ్బతినడం తగ్గించడంతో పాటు, రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తరచుగా ఓవర్లోడ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా వెయింగ్ మెషీన్ల ద్వారా వాహనాల బరువును తనిఖీ చేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎటువంటి రాయితీలు ఉండవని స్పష్టం చేశారు.ఈ కొత్త రూల్స్ అమలుతో ట్రాన్స్పోర్ట్ రంగంలో కొంత మార్పు రావచ్చని, వాహనదారులు కూడా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి