Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిరుమర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట రిపోర్టర్లు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 08:16 PM

నేతన్నల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

నేతన్నల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

నేతన్నల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
April 20, 2026 05:26 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో 'నేతన్నకు ఆరోగ్య భద్రత' మెగా వైద్య శిబిరం ప్రారంభం

కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

చేనేత కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణంలోని మార్కండేయ ఆలయ ప్రాంగణంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహించిన 'నేతన్నకు ఆరోగ్య భద్రత' మెగా వైద్య శిబిరాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలు ​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. నిరంతరం శ్రమించే చేనేత కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. వారి ముంగిటకే వైద్య సేవలను తీసుకురావాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరానికి వచ్చిన చేనేత కార్మికులకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.​"చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా పాలనలో భాగంగా ప్రతి కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించడమే మా బాధ్యత."ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, పిల్లలమర్రి మధుసూదన్, వైద్య అధికారులు డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ కాటమరాజు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సేవలు అందించారు. పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News