Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:53 AM

నేతన్నల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

నేతన్నల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

నేతన్నల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
April 20, 2026 05:26 PM 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో 'నేతన్నకు ఆరోగ్య భద్రత' మెగా వైద్య శిబిరం ప్రారంభం

కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

చేనేత కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణంలోని మార్కండేయ ఆలయ ప్రాంగణంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహించిన 'నేతన్నకు ఆరోగ్య భద్రత' మెగా వైద్య శిబిరాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలు ​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. నిరంతరం శ్రమించే చేనేత కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. వారి ముంగిటకే వైద్య సేవలను తీసుకురావాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరానికి వచ్చిన చేనేత కార్మికులకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.​"చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా పాలనలో భాగంగా ప్రతి కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించడమే మా బాధ్యత."ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, పిల్లలమర్రి మధుసూదన్, వైద్య అధికారులు డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ కాటమరాజు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సేవలు అందించారు. పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News