Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేరాలకు 'సీసీ' చెక్... పర్యావరణానికి 'హరిత' కిరీటం! అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 21, 2026 09:50 PM

నీట్ లీకేజీపై నల్లగొండలో న్యాయవాదుల నిరసన

నీట్ లీకేజీపై నల్లగొండలో న్యాయవాదుల నిరసన

నీట్ లీకేజీపై నల్లగొండలో న్యాయవాదుల నిరసన
July 21, 2026 04:12 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్ల బ్యానర్లతో ఆందోళన.. విద్యార్థుల అరెస్టులను ఖండించిన లాయర్లు.


నల్లగొండ, జూలై 21:

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా న్యాయవాదులు సోమవారం నల్ల బ్యానర్లతో నిరసన చేపట్టారు. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండను ఖండిస్తూ జిల్లా న్యాయస్థానం ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్‌లు, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి, ముఖ్యంగా యువతకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కును ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. నిరసనల సందర్భంగా అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని కోరారు.విద్యార్థుల న్యాయమైన ఉద్యమాలకు నల్లగొండ జిల్లా న్యాయవాదుల సంపూర్ణ సంఘీభావం ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి. మోహన్‌తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News