నీట్ లీకేజీపై నల్లగొండలో న్యాయవాదుల నిరసన
నీట్ లీకేజీపై నల్లగొండలో న్యాయవాదుల నిరసన
Komidala Mahender reddy
నల్ల బ్యానర్లతో ఆందోళన.. విద్యార్థుల అరెస్టులను ఖండించిన లాయర్లు.
నల్లగొండ, జూలై 21:
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా న్యాయవాదులు సోమవారం నల్ల బ్యానర్లతో నిరసన చేపట్టారు. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండను ఖండిస్తూ జిల్లా న్యాయస్థానం ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్లు, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి, ముఖ్యంగా యువతకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కును ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. నిరసనల సందర్భంగా అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని కోరారు.విద్యార్థుల న్యాయమైన ఉద్యమాలకు నల్లగొండ జిల్లా న్యాయవాదుల సంపూర్ణ సంఘీభావం ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి. మోహన్తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి