PRINT TIME: July 21, 2026 09:03 PM
నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
July 21, 2026 03:25 PM
16 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ, జూలై 21:
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నల్గొండలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, వాటర్ క్యానన్ల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు.ఢిల్లీలో దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్తో పాటు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మద్దతు దీక్ష నిర్వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. శాంతియుత నిరసనలను అణచివేయడం మానుకొని, విద్యావ్యవస్థలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి