నేడు కోదాడలో హిందూ సమ్మేళనం....
నేడు కోదాడలో హిందూ సమ్మేళనం....
Harish K
నేడు కోదాడ పట్టణంలోని ఆర్ ఎస్ వి ఫంక్షన్ హల్ లో సాయంత్రం వేళలో నిర్వహించే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు డాక్టర్ జూకూరి సంజీవ్ కుమార్ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బలుసుపాడు గురుధాం ఆశ్రమ స్థాపకులు గెంటేల వెంకటరమణ, విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి సునీత రెడ్డి, ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర సహకార్యవాహ ఎర్ర నర్సింగ్ లతో పాటు మరెందరో వక్తలు రానున్నారని తెలిపారు. స్వామీజీ అనుగ్రహ భాషణం, హనుమాన్ చాలీసా పారాయణం, వక్తల ప్రసంగం సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని హిందూ ధర్మ రక్షణ మరియు సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ హిందూ సమ్మేళనంలో భాగస్వామ్యులై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవుల రంగారావు, కొత్త రామారావు, బస్వోజు పుల్లయ్య చారి, కాజులూరి రామకృష్ణ, అక్కిరాజు యశ్వంత్, రణబోతు వెంకటరెడ్డి, సంఘపు సాయికిరణ్, చల్లా లక్ష్మీనారాయణ, గోధుమల హనుమాచారి తదితరులు పాల్గొన్నారు..........

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి