న్యాల్కల్ మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
న్యాల్కల్ మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్ మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జ్యోతిలక్ష్మి-ప్రవీణ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం
న్యాల్కల్ బస్టాండ్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు.అలాగే మండల
తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల ప్రగతిపై అధికారులు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభులు, డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి, ఆర్ఐ శ్యాంరావు, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ ప్రముఖులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి