Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:10 AM

నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలి: యాదవ నేతల డిమాండ్

నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలి: యాదవ నేతల డిమాండ్

నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలి: యాదవ నేతల డిమాండ్
March 30, 2026 05:19 PM 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలో ఏకైక యాదవ ఎమ్మెల్యేగా ఉన్న నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని యాదవ నేతలు డిమాండ్ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షుడు మేకల మల్లి బాబు యాదవ్, యాదవ యువజన జిల్లా అధ్యక్షుడు చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 5న ఖమ్మం బైపాస్ రోడ్డులోని రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఇటీవల ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన యాదవ కురుమ సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఈ కార్యక్రమంలో సన్మానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

సోమవారం కూసుమంచి, జలగం నగర్ ప్రాంతాల్లో సర్పంచులు, కౌన్సిలర్ల సమక్షంలో సన్మాన కార్యక్రమ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 18 శాతం ఉన్న యాదవ కురుమలకు తగిన రాజకీయ ప్రాధాన్యత లభించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని, యాదవ కురుమలకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

గత ప్రభుత్వం గొర్రెల పెంపకం దారుల సంఘాలను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటివరకు తగిన ప్రయోజనాలు అందలేదని, సత్వరమే ప్రత్యేక నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చెన్ను వెంకటరమణ, మెండే వెంకటేష్, బత్తుల వీరస్వామి, బుర్ర కృష్ణ, కనకయ్య, లింగయ్య, నీలకంఠం, శోభన్ బాబు, వెంకటరమణ, కౌన్సిలర్లు బోయిన కుమారి, బుర్ర మహేష్, సాయి, గౌరుమాళ్ళ, మలాది మల్లయ్య, ఏర్పుల శ్రీనివాసరావు, వీరభద్రం, నాగరాజు, శివ, రవి, యాదగిరి, ఉపేందర్, గంగయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News