స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సర్కిల్ కార్యాలయంలో నవభారత్ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను సీఐ ఎన్.వెంకటేశ్వర్లు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నవభారత్ దినపత్రిక నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ, ప్రజలు-ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తోందని ప్రశంసించారు. ప్రజా సమస్యలను ఎప్పటికీ వెలికి తీస్తూ ప్రజాదరణ పొందుతున్న ఈ పత్రిక విలువలతో కూడిన పాత్రికేయతను కొనసాగిస్తే సమాజానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని, అలాంటి పత్రికలను అందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి