Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 25, 2026 07:43 PM

నర్సింహుల గూడెం గ్రామంలో మహిళ శ్రీ శక్తి భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్

నర్సింహుల గూడెం గ్రామంలో మహిళ శ్రీ శక్తి భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్

నర్సింహుల గూడెం గ్రామంలో మహిళ శ్రీ శక్తి  భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్
February 25, 2026 06:00 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

నర్సింహుల గూడెం గ్రామంలో మహిళ శ్రీ శక్తి భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్

మునగాల మండలం నర్సింహుల గూడెం గ్రామంలో బుధవారం పొదుపు సంఘం భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కుంచం ఇందిరా నరసయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. భవనం నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల కార్యకలాపాలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆమె అన్నారు. రానున్న రోజుల్లో గ్రామాన్ని సూర్యాపేట జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామంలో నాయకులు ప్రజలు పార్టీలకు అతీతంగా సహాయ సహకారాలు అందించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతి రాజు ఏఈ వసంత, మరియు ఉపసర్పంచ్ మొగిలి చర్ల సీతారాములు, వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, మాజీ సర్పంచి కొండారెడ్డి,VOA లు, పొదుపు సంఘం అధ్యక్షురాలు గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News