నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక
నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక
స్థానికం బృందం
25 ఏళ్ల సేవ చేసిన గ్రామపంచాయతీ కామాటి మృతి
రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో 25 సంవత్సరాలుగా కామాటీగా పనిచేస్తున్న గాదే నరసింహ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. నరసింహ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసి ఓదార్చారు. గ్రామపంచాయతీకి నరసింహ చేసిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉపసర్పంచ్ మోటి రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, గంగాపురం శంకర్, మహమ్మద్ జానీ, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, మోటి మహేష్, కొమ్ము రామస్వామి, మొహమ్మద్ అంజద్, గొరిగ శేఖర్, సురివి హరిబాబు, ఊట్కూరి శీను తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి