Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

నార్కెట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, 13 మందికి గాయాలు

నార్కెట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, 13 మందికి గాయాలు

నార్కెట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, 13 మందికి గాయాలు
03-06-2026 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వేగంగా వచ్చిన మినీ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం, అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరిన మినీ ట్రావెల్స్ బస్సు నార్కెట్‌పల్లి శివారుకు చేరుకునే సరికి ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

Sthanikam

నార్కెట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, 13 మందికి గాయాలు

Article Image

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వేగంగా వచ్చిన మినీ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం, అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరిన మినీ ట్రావెల్స్ బస్సు నార్కెట్‌పల్లి శివారుకు చేరుకునే సరికి ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News