నార్కెట్పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, 13 మందికి గాయాలు
నార్కెట్పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, 13 మందికి గాయాలు
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి–నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వేగంగా వచ్చిన మినీ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, అరుణాచలం నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో బయలుదేరిన మినీ ట్రావెల్స్ బస్సు నార్కెట్పల్లి శివారుకు చేరుకునే సరికి ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగగా, పోలీసులు వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి