PRINT TIME: March 29, 2026 01:02 PM
నార్కట్పల్లిలో చిరుమర్తి లింగయ్యకు తలంబ్రాలు అందజేత
నార్కట్పల్లిలో చిరుమర్తి లింగయ్యకు తలంబ్రాలు అందజేత
March 29, 2026 10:42 AM
73 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్పల్లి: నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యను ఆయన స్వగృహంలో రామన్నపేట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ప్రసాదంగా తీసుకువచ్చిన తలంబ్రాలను అందజేశారు.
ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రం, చిన్నపాక శ్రీనివాస్ కలిసి లింగయ్యను కలిసి ఈ తలంబ్రాలను అందజేయగా, ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదాలను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి