నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీవో సూర్యనారాయణ
కోదాడ మున్సిపల్ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ తీరు, బందోబస్తు ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేడు చివరి రోజు అవడంతో అభ్యర్థులు, అనుచరుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి