Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:58 AM

నల్లగొండ ప్రజల ప్రాణాలతో రాజకీయాలు వద్దు: కైలాష్ నేత ఆగ్రహం

నల్లగొండ ప్రజల ప్రాణాలతో రాజకీయాలు వద్దు: కైలాష్ నేత ఆగ్రహం

నల్లగొండ ప్రజల ప్రాణాలతో రాజకీయాలు వద్దు: కైలాష్ నేత ఆగ్రహం
March 14, 2026 06:08 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మూసి ప్రక్షాళన అంశంపై బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత మండిపడ్డారు. గాంధీ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ను “బ్రోకర్ల రాష్ట్ర సమితి”గా అభివర్ణించారు. నల్లగొండ ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్న సమయంలో బీఆర్‌ఎస్ నేతలు బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

నల్లగొండ జిల్లాలో సుమారు 45 లక్షల మంది ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే, బీఆర్‌ఎస్ నేతలు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలను అనుసరిస్తూ హరీష్ రావు కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు.

బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లో ఉన్న నాయకులు నల్లగొండ జిల్లాను అభివృద్ధి నుంచి దూరం చేయాలని చూస్తున్నారని కైలాష్ నేత అన్నారు. మూసి నది కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకు ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. రైతులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కైలాష్ నేత స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News